హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఈ సీజన్ ప్రత్యేకంగా మారింది. నగరంలో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ (SMAT) మ్యాచ్లకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం(FreeEntry) కల్పిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశంతో రోజువారీగా స్టేడియాల్లో భారీగా క్రికెట్ అభిమానులు చేరుకుంటున్నారు. అంతేకాదు, ఈసారి పాల్గొంటున్న ఇండియా టీమ్ స్టార్ ప్లేయర్లు కారణంగా ఉత్సాహం మరింత రెట్టింపైంది.
Read Also: Gill-Hardik: టీమ్ ఇండియాకు డబుల్ బూస్ట్

ఈ టోర్నీలో పాల్గొంటున్న ప్రధాన క్రికెటర్లు
- హార్దిక్ పాండ్య – గాయానంతరం మళ్లీ ఫిట్గా కనిపిస్తున్న ఆల్రౌండర్
- కృనాల్ పాండ్య – అద్భుత ఫార్మ్లో ఉన్న ఆల్రౌండర్
- ఇషాన్ కిషన్ – టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మన్
- అభిషేక్ శర్మ – ఐపీఎల్లో సత్తా చాటిన పవర్ హిట్టర్
- మహ్మద్ షమీ – టీమ్ ఇండియా స్టార్ పేసర్
- హర్షల్ పటేల్ – డెత్ ఓవర్ల ప్రత్యేక నిపుణుడు
ఈ స్టార్ ప్లేయర్లను(FreeEntry) ప్రత్యక్షంగా చూస్తున్న అభిమానులు సోషల్ మీడియాలో కూడా పిక్స్, వీడియోలు షేర్ చేస్తూ ఫుల్ జోష్లో ఉన్నారు.
మ్యాచ్లు జరుగుతున్న మైదానాలు
- రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్
- జింఖానా గ్రౌండ్
- ఎల్బీ స్టేడియం
మూడు స్టేడియాల్లోనూ సెక్యూరిటీ, పార్కింగ్, ఫుడ్ కోర్టులు వంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశీయ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీలో ఈ స్థాయి క్రికెటర్లు ఆడటం అరుదైన విషయం. అందుకే అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: