రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ
శ్రీకాళహస్తి : ప్రభుత్వ విద్య,(AP) పరిశ్రమల భాగస్వామ్యా లను బలోపేతం చేయటానికి తిరుపతి ఐఐటి కృషి చేస్తుందని డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ వివరించారు. తిరుపతి(Tirupati) ఐఐటిలో సోమవారం ప్రత్యేక ఇండియన్ లీన్ కన్స్ ట్రక్షన్ సమావేశాలను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నేడు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక, నిర్మాణ రంగంలో శరవేగంగా సాగుతుందన్నారు. నిర్మాణ రంగంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకొనుటకు, నిర్మాణ రంగంలో సామర్థ్యాలను పెంచుకుంటూ వృధాలను తగ్గించుకొనుటకు మున్సిపల్ రంగంలో ప్రాజెక్టులను వేగవంతం చేయటానికి లీన్ పద్దతులను అమలు చేయటానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు.
Read also: ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా భారీ నిరసనలకు పిలుపు

తిరుపతి ఐఐటి పరిశ్రమ–విద్యా సమన్వయం సదస్సు
ఈ సమావేశంలో(AP) డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ మూడు రోజుల కార్యక్రమాల గురించి వివరిస్తూ విద్యా పరిశోధనలను పరిశ్రమ అవసరాలతో అనుసంధానించటం అనే లక్ష్యంతో తిరుపతి ఐఐటి ముందుకు వెళుతుందని వివరించారు. ఈ పరిశ్రమ దినోత్సవం అత్యాధునిక విద్యాధృడత్వాన్ని పరిశ్రమ ఉత్తమ పద్దతులలోకి అనువందించటానికి భారత జాతీ నిర్మాణ ప్రాజెక్టులకు బలమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్ధారించటానికి నిబద్ధతతో పని చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమాల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చైర్మన్ మరియు గోద్రెజ్ కన్స్ట్రక్షన్స్ సీనియర్ వైస్ చైర్మన్ బిజెనెస్ హెడ్ అనుప్ మాధ్యూ, ఐఎల్సిఇ కార్యదర్శి, జనరల్ కైజాద్ంజావాలతో సమీక్షలు జరిగాయి. పలువురు వక్తలు మాట్లాడుతూ భారత దేశ మౌలిక సదుపాయాలను మార్చటంలో సామర్థ్యం, స్థిరత్వం, సాంకేతిక పురోగతిని ప్రోత్సహించటంలో ‘లీన్ కన్స్ట్రక్షన్’ పద్ధతులు కీలకంగా ఉంటాయన్నారు. ఈ విధానం విదేశాల నుంచి భారత దేశానికి 2008లో వచ్చిందని వివరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: