విశాఖపట్ణం కైలాసగిరిలో నిర్మించిన ప్రతిష్టాత్మక గ్లాస్ బ్రిడ్జ్(Vizag Glass Bridge) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు ₹7 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు(Velagapudi Ramakrishnababu), వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ కలిసి ప్రారంభించారు.
Read Also: Tenali: 104 కోట్ల ధాన్యం కొనుగోలుకు గూడ్స్ రైలు ఏర్పాటు: మంత్రి నాదెండ్ల

500 టన్నుల భారాన్ని తట్టుకునే సామర్థ్యం
ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో 40 మిల్లీమీటర్ల మందం కలిగిన ప్రత్యేక ల్యామినేటెడ్ గాజును ఉపయోగించారు. దీనిని జర్మనీ నుంచి దిగుమతి చేశారు. 500 టన్నుల భారాన్ని తట్టుకునే సామర్థ్యం ఉన్న ఈ గ్లాస్ బ్రిడ్జ్, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులకు కూడా ప్రతిఘటించగలదు. ఒకేసారి 40 మంది సందర్శకులు బ్రిడ్జ్పైకి చేరవచ్చు.
ప్రారంభ కార్యక్రమంలో ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ, విశాఖను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్(Vizag Glass Bridge)ను అభివృద్ధి చేశామని తెలిపారు. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మౌలిక సదుపాయాలను రూపొందించామని చెప్పారు. త్వరలో కైలాసగిరి ప్రాంతంలో త్రిశూల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: