పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(Winter Session Parliament) సోమవారం మొదలైన వెంటనే ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తొలి రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహారశైలిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించాల్సిన వేళ, ప్రధాని మళ్లీ ప్రదర్శనలకు మొగ్గుచూపారని ఆయన ఆరోపించారు. సమావేశాల ప్రారంభానికి ముందు మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఖర్గే ఇలా స్పందించారు.
Read Also: Parliament: శీతాకాల సమావేశాలను కుదించడంపై ప్రతిపక్షాల ఆగ్రహం
గత వర్షాకాల సమావేశాల్లోనే 12 బిల్లులను అదేపనిగా ఆమోదించారని గుర్తుచేశారు. కొన్నింటిపై కనీసం 15 నిమిషాల కూడా చర్చించలేదని, మరికొన్నింటిని ఏ చర్చ లేకుండానే ఆమోదించారని ఆయన ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ చట్టాలు, జీఎస్టీ, భారత పౌర భద్రతా చట్టాలు వంటి వివాదాస్పద నిర్ణయాలను బలవంతంగా పార్లమెంటు ద్వారా నెట్టేశారని మండిపడ్డారు.

రాజకీయాలకు ముగింపు
మణిపూర్ హింసాకాండపై చర్చ పెట్టమని విపక్షాలు పదేపదే కోరినా, అవిశ్వాస తీర్మానం వచ్చే వరకు ప్రధాని స్పందించలేదని ఖర్గే(Mallikarjuna Kharge) విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న ‘ఎస్ఐఆర్(ASIR)’ విధానంలో భారీ పనిభారం వల్ల బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల దోపిడీ వంటి కీలక అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని, ఇకనైనా బీజేపీ దారి మళ్లించే రాజకీయాలకు ముగింపు పలకాలని కోరారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు, దేశ వనరుల దుర్వినియోగం వంటి ప్రజా సమస్యలపై చర్చించడమే ముఖ్యం అన్నారు.
ఇక కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా ప్రధానిని ఆక్షేపిస్తూ స్పందించారు. మోదీ పార్లమెంటుకు తరచుగా రారని, విపక్షాలతో చర్చించరని పేర్కొన్నారు. కానీ ప్రతి సమావేశం ముందు భవనం బయట నిలబడి శాంతి, సహకారం వంటి సందేశాలు ఇవ్వడం కపటత్వమని ఆయన వ్యాఖ్యానించారు. సభ సజావుగా నడవకపోతే దానికి పూర్తి బాధ్యత ప్రధాని మొండి వైఖరిదేనని పేర్కొంటూ, “అందరిలో పెద్ద నాటకరాయుడు ప్రధానే” అని ఘాటుగా విమర్శించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: