నేటి నుంచి దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) వాణిజ్య సిలిండర్ల ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ ధర సవరణ ప్రక్రియలో భాగంగా వచ్చిన ఈ తగ్గింపు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ యూనిట్లు, బేకరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, ఇతర వ్యాపార రంగాలకు స్వల్ప ఉపశమనం కలిగించనుంది. కొత్త ధరలు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. ధర తగ్గింపులో వినియోగదారులు కొంత ఊరట పొందుతున్నప్పటికీ, గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.
Read Also: Ditwa Cyclone: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ ప్రభావం తీవ్రం

వాణిజ్య ధరలు మొత్తం రూ.15 తగ్గాయి
ఈసారి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ (cylinder) ధర రూ.10 తగ్గింది. ఇందుకు ముందు కూడా గత నెలలో రూ. 5 వరకు తగ్గింపు జరిగింది. అంటే రెండు నెలల్లో కలిపి వాణిజ్య ఎల్పీజీ ధరలు మొత్తం రూ.15 తగ్గాయి. పెరుగుతున్న రవాణా ఖర్చులు, అంతర్జాతీయ ఇంధన ధరల మార్పుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించిన ధరల ప్రకారం 19కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ఢిల్లీలో రూ.1,590,50 నుండి రూ.1,580.50కి తగ్గింది.
అలాగే కోల్ కతాలో ధర రూ.1,694 నుండి రూ.1,684 తగ్గించబడింది. గత కొన్ని నెలలుగా గృహ ఎల్పీజీ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం గృహ వినియోగదారులపై అదనపు భారాన్ని పెట్టకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
రెస్టారెంట్లు, హోటళ్లకు ఊరట
ఈ వాణిజ్య ఎల్పీజీ ధర తగ్గడంతో హోటల్, రెస్టారెంట్ రంగం కొంత ఉపశమనం పొందనుంది. మహమ్మారి ప్రభావం, పెరుగుతున్న ఆపరేటింగ్ ఖర్చులు, ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా రెస్టారెంట్ ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా వంట గ్యాస్ ధరల తగ్గింపు వారికి కొంత ఊరట ఇస్తోంది. దీనివల్ల భోజనాల ధరలను స్థిరంగా ఉంచడానికి లేదా కొంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: