విజయవాడ : ఆగమ, వైదిక పండితుల ఏకాభిప్రాయం రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను 2027 జూన్ 26 నుంచి జులై 7వరకు నిర్వహించాలని ఆగమ, వైదిక పండితులు సూచించారు. ఈ మేరకు తేదీలతో కూడిన నివేదికను దేవాదాయ శాఖ ప్రభుత్వానికి పంపింది. ఈ నివేదికను అనుసరించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. గోదావరి పుష్కరాలను (GODAVARI PUSHKARAM) ఏయే తేదీల్లో నిర్వహించాలనే దానిపై ఇటీవలన దేవాదాయ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలకు చెందిన ఆగమ, వైదిక పండితులు టిటిడి ఆస్థాన సిద్దాంతితో కలిసి మొత్తం 18 మంది పాల్గొన్న సమావేశంలో పుష్కరాల తేదీలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. దీనిపై ప్రభుత్వం అథికారికంగా చర్యలు తీసుకున్నామని మంత్రి మనోహర్ తెలిపారు.
Read also: Kollu Ravindra: పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

Godavari Pushkaralu 2027
పవన్ కల్యాణ్ సూచనల మేరకు
ఇంత భారీ స్థాయిలో ఇబ్బంది ఎందుకు వస్తుందంటే 90 రోజుల పాటు జరగాల్సిన ప్రక్రియను కేవలం వారం రోజుల వ్యవధిలోనే పూర్తి చేయాలని భావించటమే ప్రధాన కారణమన్నారు. క్షేత్రస్థాయిలో గోనె సంచులను ఉచితంగా పంపిణీ చేయిస్తున్నామన్నారు. హమాలీలు, కూలీల సమస్య ఉందని సోమవారం ఆ సమస్య తీరుతుందని మంత్రి చెప్పారు. రైస్ మిల్లుల ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అనుసంధానంతో ప్రగతి సాధిస్తున్నామని మంత్రి మనోహర్ వివరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గుమ్మడి సిద్ధార్థ, మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, ఎంపిటిసి హరికృష్ణ, అత్తోట ఉప సర్పంచ్ దివ్వెల ఏడుకొండలు, నాయకులు అడపా నారాయణరెడ్డి, వై. వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: