పోలవరం, అమరావతి ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్న డి.సిఎం పవన్
విజయవాడ : పార్లమెంటులో రాష్ట్ర ప్రభుత్వం(D.CM Pawan) డిమాండ్లను ప్రస్తావిస్తూ, మనం గుర్తించిన ఇతర సమస్యలను పరిష్కరించే దిశలో జనసేన వాణి ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి అంశంపై ఎన్డీఏ కూటమి సభ్యులు సమాలోచన చేయాలని, తరువాత పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు.
Read also: వ్యవసాయ, అణుశక్తి, బీమాలో సంస్కరణలు

పార్లమెంట్ వ్యూహాలపై కీలక చర్చ
అమరావతిలో(D.CM Pawan) లోక్సభ సభ్యులు బాలశౌరి, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్ లో గట్టిగా గళం విప్పాలని సూచించారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేందుకు ముందస్తుగా సిద్ధం కావాలని ఎంపీలకు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు సంబంధిత కేంద్ర మంత్రులతో సమావేశమై, వివరణాత్మక నివేదికలు అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహకారం చాలా కీలకమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన నిధులపై రాష్ట్ర అధికారులతో సమీక్షి ంచి, ఆ వివరాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: