కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దిత్వా తుపాను ప్రభావంతో తిరుమల (Tirumala) లో వర్షాలు కురుస్తున్నా, చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
Read Also: Sri Lanka cyclone : శ్రీలంకను శోకసంద్రంలో ముంచిన దిత్వా తుపాను.. ఇప్పుడు భారత్ వైపు కదలికలు…

15 గంటల సమయం
టోకెన్లు లేని భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు 15 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తెలిపారు.నిన్న ఒక్కరోజే 79,791 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.73 కోట్లుగా నమోదైందని టీటీడీ వెల్లడించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: