వరల్డ్ డొమెస్టిక్ క్రికెట్లో 3 ఫార్మాట్లలో (ఫస్ట్ క్లాస్, లిస్ట్-A, T20) సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్గా ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre), (18y 135d )రికార్డు నెలకొల్పారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట 19 ఏళ్లుగా ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) లో భాగంగా శుక్రవారం విదర్భతో జరిగిన మ్యాచ్లో ఆయుశ్ (Ayush Mhatre) విధ్వంసక సెంచరీతో చెలరేగాడు.
Read Also: T20 series: ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్..షెడ్యూల్ విడుదల

రోహిత్ శర్మ వెనక్కి నెట్టాడు
లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆయుశ్ కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్లతో తన తొలి టీ20 సెంచరీని నమోదు చేశాడు. 18 సంవత్సరాల 135 రోజుల వయసులో అతను ఈ ఘనత సాధించి, 19 ఏళ్ల 339 రోజుల వయసులో ఈ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో ఉన్ముక్త్ చంద్, క్వింటన్ డికాక్ వంటి ఆటగాళ్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: