వికారాబాద్: వికారాబాద్ జిల్లా (Vikarabad) కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భూ సమస్యను పరిష్కరించడం లేదని యువ రైతు గగ్గోలు పెట్టాడు.
Read Also: Grama Panchayat Elections : మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నిక నిలిపివేత

సంఘటన వివరాలు
వివరాల్లోకి వెళ్ళితే.. కొడంగల్ నియోజకవర్గం చిట్లపల్లి గ్రామానికి చెందిన యువ రైతు శ్రీనివాస్ భూ సమస్య పరిష్కారం కోసం గత రెండు సంవత్సరాలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో గురువారం కలెక్టర్ కార్యాలయం ప్రవేశ ద్వారం మెయిన్ గేట్ దగ్గర తాడుతో ఉరి వేసుకుంటానని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.
విషయం గమనించిన కలెక్టరేట్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే శ్రీనివాస్ను అడ్డుకొని కాపాడారు. తదనంతరం అతడిని శాంతపరిచే ప్రయత్నం చేశారు.
రైతు ఆవేదన, సీఎం నియోజకవర్గంలో సమస్యలు
ఏళ్లు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై శ్రీనివాస్ (Srinivas) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నా కూడా తమకు న్యాయం జరగడం లేదని రైతు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: