విశాఖపట్నం (Vishapatnam) లో ప్రపంచ స్థాయి AI నేటివ్ డేటా సెంటర్ క్యాంపస్ను నిర్మించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్ఫీల్డ్, డిజిటల్ రియాలిటీ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ డిజిటల్ కనెక్షన్, ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్తో అధికారిక అవగాహన ఒప్పందం (MoU) పై సంతకం చేసింది.
Read Also: Smriti Mandhana: స్మృతి మంధాన కు జెమీమా అండ
అత్యంత పెద్ద ప్రాజెక్టులలో ఒకటి
ఈ ఒప్పందం కేవలం ఒక ప్రాజెక్టును ప్రారంభించడం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిశను మరోసారి ప్రపంచానికి తెలియజేసిన ఘట్టం. 2030 నాటికి రూ. 98 వేల కోట్ల పెట్టుబడి, 400 ఎకరాల భూమిలో 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మించబోయే ఈ డాటా సెంటర్,
భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది.ఈ ఒప్పందంపై సంతకం అనంతరం.. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ‘X’లో (CM Chandrababu) పోస్ట్ చేశారు.
భారతదేశం యొక్క డేటా రాజధానిగా వైజాగ్ ఎదుగుతోంది! రూ. 98 వేల కోట్లతో రిలయన్స్ జెవి 1 GW AI డేటా సెంటర్ను నిర్మిస్తోంది. ఇది ఉపాధి, ఆవిష్కరణలు, ప్రపంచ సాంకేతిక పెట్టుబడులను ఆకర్షిస్తుందని పోస్టులో తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: