తెలంగాణ(TG)లో స్థానిక సంస్థల ఎన్నికల(Elections) నిర్వహణ కోసం ప్రభుత్వం నవంబర్ 22న జారీ చేసిన జీవో నెం.46పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఈ ఉత్తర్వు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపే రిజర్వేషన్లు మొత్తం 50% కంటే ఎక్కువ కాకూడదని ప్రభుత్వం స్పష్టంచేసింది.
Read Also: Revanth Reddy: మున్సిపాలిటీలు GHMC లో విలీనం త్వరలో GO

దీంతో బీసీలకు కేవలం 22% రిజర్వేషన్ మాత్రమే లభించే అవకాశం ఉందని బీసీ సంఘాలు ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవోను వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ మొత్తం విషయంపై రేపు కోర్టు విచారణ జరపనుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: