రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ విస్తరణ పనులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేశారు.. దేవతల రాజధాని అమరావతి అని, మన రాజధానికి అమరావతి (Amaravati)పేరు పెట్టే అవకాశం దేవుడు తనకిచ్చారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) చెప్పారు. ‘ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తి ఈ గుడికి ఉంది.
Read Also: YV Subba Reddy: నేను ఏ తప్పు చేయలేదు..పాలీగ్రాఫ్ టెస్టుకు సిద్ధం

దేవతల రాజధాని
రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని టీటీడీ (TTD) ని కోరుతున్నా. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతిఒక్కరికీ ఇవ్వాలని స్వామిని వేడుకుంటున్నా’ అని (CM Chandrababu) పేర్కొన్నారు.
మొత్తం రూ.260 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో ఈ పనులను చేపట్టనున్నారు. తొలి దశలో రూ.140 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం, ఏడంతస్తుల మహారాజగోపురం, వివిధ మండపాలు, పుష్కరిణి వంటివి నిర్మించనున్నారు. రెండో దశలో రూ.120 కోట్లతో మాడ వీధులు, అన్నదాన సత్రం, యాత్రికుల వసతి సముదాయాలు, పరిపాలన భవనం వంటివి నిర్మిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: