టోని బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్ స్టడీ నివేదిక ప్రకారం, భారతదేశంలో ఊబకాయం, ఒక ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఈ అధ్యయనంలో, దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు, అంటే సుమారు 25% మంది, ఒబెసిటీతో బాధపడుతున్నట్టు స్పష్టమైంది. లింగాల వారీగా చూస్తే, 24% మంది మహిళలు మరియు 23% మంది మగవారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, ఒబెసిటీ సంబంధిత వ్యాధులు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, పల్లె ప్రాంతాలకు కూడా వేగంగా విస్తరిస్తున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) 2019-21 డేటా ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో 41% మంది మహిళలు ఒబెసిటీతో బాధపడుతున్నారని వెల్లడైంది, ఇది జాతీయ సగటు కంటే చాలా అధికం.
Read Also: Hemp Seeds: హెంప్ సీడ్స్ ఆరోగ్య ప్రయోజనాలు

ఊబకాయం(Obesity) పెరగడానికి ప్రధాన కారణం, ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులే. శారీరక శ్రమ తగ్గిపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు (Junk Food వినియోగం), అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, మరియు పట్టణీకరణ వంటి అంశాలు దీనికి దోహదపడుతున్నాయి. ఒబెసిటీ అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇది టైప్-2 మధుమేహం (Diabetes) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది, అలాగే అధిక రక్తపోటు (Hypertension), అధిక కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులు (Coronary Heart Disease) వంటి హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
అధిక బరువు కారణంగా(Obesity) మోకాళ్లు మరియు కీళ్లపై ఒత్తిడి పెరిగి కీళ్ల నొప్పులు (Joint Problems) తలెత్తుతాయి, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సమస్యను ఎదుర్కోవాలంటే, ప్రజలలో సమతుల్య ఆహారం, నిరంతర వ్యాయామం, మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించడం తక్షణ కర్తవ్యం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: