తిరుమల శ్రీవారికి ఎన్నారై మంతెన రామలింగరాజు (Mantena Ramaraju) ఏకంగా రూ.9కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని పీఏసి 1, 2,3 భవనాల అధునీకరణకు రూ.9 కోట్లు విరాళం ఇచ్చారు. మంతెన రామలింగరాజు (Mantena Ramaraju) కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజు పేరిట ఈ విరాళాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు.అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో విరాళం అందజేశారు.
Read Also: CM Chandrababu: అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు

సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో భారీ విరాళం అందజేశారు. ఇటీవల రామలింగరాజు మంతెన కుమార్తె నేత్ర, ఎన్నారై వంశీ గాదిరాజు వివాహ మహోత్సవం ఉదయ్పుర్లో జరిగిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పల నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
రామలింగరాజు మంతెన టీటీడీ (TTD) కి భారీగా విరాళం ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో 2012వ సంవత్సరంలోనూ ఆయన రూ.16 కోట్లను విరాళంగా అందజేశారు. కాగా, ఇటీవల ఆయన కుమార్తె నేత్ర, ఎన్నారై వంశీ గాదిరాజుల వివాహం ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: