రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని అత్యంత విలువైన స్థలంపై ఒక వ్యక్తి కళ్లుపెట్టి(LandFraud) నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA) తయారు చేసి కబ్జా చేసిన ఘటన వెలుగుచూసింది. ఆ తర్వాత అదే స్థలాన్ని మరో వ్యక్తికి విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తిచేశారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే—ఈ భూభాగం నిషేధిత భూముల జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్ అసలు చెయ్యకూడదు. అయితే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ లంచాల కోసం అన్ని నిబంధనలను లెక్కచేయకుండా రిజిస్ట్రేషన్ చేసినట్టు తేలింది.
Read Also: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. 2 గంటలు దాటితే ఫైన్!

స్థలం(LandFraud) అసలు యజమాని ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి కావడం, స్థానికంగా నివసించకపోవడంతో ఈ మొత్తం వ్యవహారం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోయింది. ఇటీవల ఆయన హైదరాబాద్కు వచ్చి ఈసీ తీసుకోవడంతో కుంభకోణం బట్టబయలైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి కబ్జాదారుడితో పాటు జాయింట్ సబ్ రిజిస్ట్రార్పై కేసు పెట్టారు.
నకిలీ GPAతో మోసం ఎలా జరిగింది?
ఘజియాబాద్కి చెందిన ఆర్వీ రమణకుమార్ (65) గచ్చిబౌలి టెలికాం ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలోని సర్వే నం. 91లో 700 చదరపు గజాల భూమిని 1987లో కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ సుమారు రూ.14 కోట్లు. తరచూ హైదరాబాద్కు వచ్చి తన స్థలాన్ని పరిశీలించే రమణకుమార్ ఇటీవల ఈసీ తీసుకోగా, భూమి చిట్టినీడి శేఖర్ బాబు పేరిట రికార్డులో కనిపించింది. దీనిపై విచారణ జరిపిన ఆయనకు కర్మన్ఘాట్కు చెందిన శ్రీకాంత్ చిగులూరి నకిలీ GPA సృష్టించి, తన భూమిని శేఖర్ బాబుకు అమ్మిన విషయం తెలిసింది.
నిషేధిత భూమిని కూడా రిజిస్టర్ చేసిన రిజిస్ట్రార్
ఈ 700 గజాల స్థలం నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కె. మధుసూదన్ రెడ్డి నియమాలను పక్కనపెట్టి రిజిస్ట్రేషన్ చేసినట్టు తేలింది. దీంతో సైబరాబాద్ EOW పోలీసులు మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ చిగులూరి, శేఖర్ బాబు మరియు ఈ వ్యవహారంలో భాగమైన ఇతరులపై కేసులు నమోదు చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :