తెలంగాణలో (TG Weather) ఒకవైపు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా.. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికను జారీ చేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మలక్కా స్ట్రైట్ మధ్య ప్రాంతంలో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఉదయం దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుంది.
Read Also: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. 2 గంటలు దాటితే ఫైన్!
ఈ అల్పపీడనం రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది. నవంబర్ 24 నాటికి ఇది ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Department) అంచనా వేసింది.అంతేకాకుండా.. ఈ వాయుగుండం తదుపరి 48 గంటల్లో అంటే నవంబర్ 26, బుధవారం నాటికి మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశలో కదలి, నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని కూడా పేర్కొంది.
ఈ వ్యవస్థ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయి. ఈ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ (TG Weather) జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఈ వర్షాలు ఈ సీజన్లో అసాధారణమైనవిగా పరిగణించవచ్చునని అధికారులు చెబుతున్నారు.

ఈ నెల చివరి వారంలో చలి తీవ్రత పెరగనుంది
ఎందుకంటే సాధారణంగా నవంబర్ చివరి వారంలో చలి తీవ్రత పెరుగుతుందని దానికి భిన్నంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు.గాలులు ప్రధానంగా తూర్పు దిశ నుంచి వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. రాగల రెండు,
మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: