20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) జోహన్నెస్బర్గ్ చేరుకున్నారు. ఈ సదస్సులోని మూడు స్టేషన్లలో ఆయన పాల్గొంటారు. సమ్మిళిత అభివృద్ధి వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధస్సు వంటి కీలక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకోనున్నారు. అయితే ప్రపంచంలోని ముగ్గురు అగ్రనాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేదు.
Read Also: Vehicle checking: వెహికల్ చెకింగ్లో ఈ పత్రాలు తప్పనిసరి!

అసలు కారణం ఏమిటి?
అమెరికా (G20) జి20 వ్యవస్థాపక సభ్యదేశం. తదుపరి అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. అలాంటి సమయంలో ఈ సమా దేశంలో అగ్రరాజ్యం పాల్గొనకపోవడం అనేది ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో జి20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాబోనని స్పష్టంగా ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులు అణచివేతకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. కొత్త భూ సంస్కరణల చట్టం తర్వాత దక్షిణాఫ్రికా లో శ్వేతజాతి రైతులు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే చివరి నిమిషంలో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి అమెరికా తన తాత్కాలిక రాయబారి మార్క్ డి. డిల్లార్డ్ను పంపింది.
అనారోగ్యంతో జిన్ పింగ్ దూరం?
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Jinping) కూడా జి20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేదు. ఆయన అనారోగ్యంతో ఉన్నారని, ఆయన బదులుగా చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్ ను తన ప్రతినిధిగా పంపినట్లు సమాచారం. ఇక పుతిన్ పై అరెస్టు వారెంట్ కారణంగా ఆయన విదేశీపర్యటనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: