చాలా కాలంగా చర్చలలో ఉన్న ఆదిత్య 369 సీక్వెల్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’ సినిమా గురించి నందమూరి బాలకృష్ణ (Balakrishna) అప్డేట్ ఇచ్చారు.. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్లో బాలకృష్ణతో పాటు ఆయన కుమారుడు మోక్షజ్ఞ (Mokshanga) కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.
సైన్స్ ఫిక్షన్- అడ్వెంచర్ కథ
ఈ విషయాన్ని బాలయ్య (Balakrishna) తెలిపిన వెంటనే నందమూరి అభిమానుల్లో భారీ హైప్ మొదలైంది. ముఖ్యంగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, ఇప్పుడు అతని తొలి సినిమా ఎప్పటి నుంచి మొదలవుతుందో తెలుసుకోవడానికి మరింత ఆసక్తిగా ఉన్నారు.బాలయ్య ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పటికీ, సినిమా ఎప్పుడు సెట్స్కి వెళ్తుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అయితే అభిమానులు మాత్రం ఈ సినిమా 2025లోనే ప్రారంభమవుతుందేమో అని అంచనా వేస్తున్నారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్- అడ్వెంచర్ కథ అయినందున భారీ స్థాయిలో ప్రీ–ప్రొడక్షన్ పని అవసరం ఉంటుంది. అందువల్లనే టీమ్ కొంత సమయం తీసుకుంటున్నారని భావిస్తున్నారు.“సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు? ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.
సీక్వెల్పై భారీ అంచనాలు
బాలకృష్ణ తాజా ప్రకటనతో వారి ఆశలు మళ్ళీ పెరిగాయి. ఇప్పుడు అందరి దృష్టి అధికారిక పూజ, షూటింగ్ ప్రారంభం మీదే ఉంది. బాలకృష్ణ మాటలతో ‘ఆదిత్య 999 మ్యాక్స్’ పై మరోసారి భారీ ఆసక్తి పెరిగింది. మోక్షజ్ఞ డెబ్యూ ఈ సినిమాతోనే జరుగుతుందనే ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు సెట్స్కి వెళ్తుందనే విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: