కర్నూలు(Kurnool) జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి, పోలీసుల ముందే వారి జీపును దొంగిలించి తన ఇంటికి తీసుకెళ్లడం స్థానికంగా పెద్ద చర్చగా మారింది.
ఆలూరుకు సమీపంలోని పెద్దహోతూరు గ్రామానికి చెందిన యువరాజు అనే వ్యక్తిని బుధవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(Driver) కేసులో అదుపులోకి తీసుకుని అతని బైక్ను స్టేషన్లో ఉంచారు. రెండు రోజుల తర్వాత, శుక్రవారం ఉదయం యువరాజు స్టేషన్కు వచ్చి తన బైక్ను తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో, “బైక్ ఇవ్వకపోతే మీ జీపుతోనే వెళ్లిపోతా” అని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Read Also: CM Chandrababu: ఈ నెల 24 నుంచి ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం

మత్తుతో పడిపోయిన అతడిని కుటుంబ సభ్యులు
అతడి మాటలను పోలీసులు సరదాగా తీసుకున్నారు. కానీ యువరాజు ఆశ్చర్యపరిచేలా అక్కడే ఉన్న సీఐ జీపులోకి ఎక్కి దాన్ని నడుపుకుని తన గ్రామానికి వెళ్లిపోయాడు. ఇంటికి చేరిన తర్వాత తీవ్ర మత్తుతో పడిపోయిన అతడిని కుటుంబ సభ్యులు ఏమీ అడగలేని పరిస్థితి ఏర్పడింది.
తర్వాత ఈ ఘటనను గమనించిన యువరాజు సోదరుడు అంజి, వెంటనే జీపును తీసుకుని తిరిగి పోలీస్ స్టేషన్కు అప్పగించాడు. ఈ వార్త ప్రాంతంలో విస్తరించడంతో, సీఐ రవిశంకర్ను పైవర్గాలు వివరణ కోరగా, “అటువంటి ఘటన జరగలేదు” అని ఆయన ఖండించడం ఆసక్తికరం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: