Telangana panchayat elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేలా ఎస్ఈసీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఎన్నికల ప్రక్రియను డిసెంబర్ 10 నుండి డిసెంబర్ 20 మధ్యలోపే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 20 నవంబర్ 2025 Horoscope in Telugu
ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో సమావేశం
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ఈ మేరకు యంత్రాంగం మొత్తం అలర్ట్ అవ్వాలని ఆదేశించింది.
ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే ఎన్నికలు :
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరగనున్న ప్రజాపాలన వారోత్సవాలు పూర్తయ్యాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. (Telangana panchayat elections) అంటే, వారోత్సవాల తరువాత వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
రిజర్వేషన్ల వివాదం – హైకోర్టు జోక్యం (Telangana panchayat elections) :
ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం ఇటీవల బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది.
అయితే, రిజర్వేషన్లు 50% దాటకూడదు అనే కారణంతో హైకోర్టు ఆ నోటిఫికేషన్ను రద్దు చేసింది.
దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి.
హైకోర్టు ఈ నెల 24లోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం చురుకుగా కదులుతూ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేయడం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :