
జడ్చర్ల మండలం మాచారం వద్ద జాతీయ రహదారి 44పై గురువారం ఉదయం ఒక ప్రమాదం(Bus Accident) చోటుచేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్(Hyderabad) దిశగా వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందుగా వెళుతున్న యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే ట్యాంకర్ నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయంతో తల్లడిల్లిపోయారు.
Read Also: Bihar: 26 మంత్రులతో నితీష్ కొత్త క్యాబినెట్
బస్సులో మొత్తం 26 మంది ప్రయాణికులు
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 26 మంది ప్రయాణికులు ఉండగా, సంఘటనతో వారు ఒక్కసారిగా అలజడికి గురయ్యారు. అప్రమత్తమైన ప్రయాణికులు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందనడంతో బస్సు కిటికీలు పగలగొట్టి బయటకు వచ్చి తమను తాము రక్షించుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని నీటితో ట్యాంకర్ నుంచి వస్తున్న పొగలను పూర్తిగా అదుపు చేశారు. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రయాణికుల మాటల్లో డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని, అతివేగం వలన బస్సు నియంత్రణ కోల్పోయిందని ఆరోపించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: