రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలని, భారీగా ఉద్యోగాల కల్పన జరగాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) పునరుద్ఘాటించారు. గత 11 సంవత్సరాల్లో ఎన్ని ఎంవోయిలు, పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. పెట్టుబడుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రజల చెవిలో ఏకంగా క్యాలీఫ్లవర్లు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎంఓయూలన్నీ కూడా నాలుక గీసుకోడానికి తప్పా దేనికి ఉపయోగపడలేదని వ్యాఖ్యానించారు.
Read Also: Chandrababu Naidu: రాష్ట్ర అభివృద్ధిని ఎవరూ ఆపలేరు

పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో
బుధవారం విజయవాడలో మీడియా సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న కూటమి ప్రభుత్వం.. ఇటీవల విశాఖపట్నంలో లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కుదుర్చుకున్న ఎంఓయూలు, సమ్మిట్ ద్వారా వచ్చిన పెట్టుబడులపై తమకు నమ్మకం కలగట్లేదని, మళ్ళీ ఇస్తామని చెప్తున్న 16.25 లక్షల ఉద్యోగాల మీద క్లారిటీ కలగట్లే దాని షర్మిల అన్నారు.
చంద్రబాబుకు బాండ్ పేపర్ పంపిస్తున్నామని, దీని మీద 613 ఎంఓయూలు, 16.31 లక్షల ఉద్యోగాలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు అని రాసి సంతకం పెట్టాలిని, ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కుదుర్చుకున్న పరస్పర అవగాహన ఒప్పందాల వల్ల ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని నిలదీశారు. గత 11 సంవత్సరాల్లో ఎన్ని ఎమయిలు, పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన ఎంఓయూలన్నీ కూడా నాలుక గీసుకోడానికి తప్పాదేనికి ఉపయోగపడలేదని వ్యాఖ్యానించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: