అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల(Maoist Encounter) మధ్య తీవ్రంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై స్పష్టమైన సమాచారాన్ని అందుకున్న పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో మావోయిస్టులు అకస్మాత్తుగా ఎదురవడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.
Read Also: FakeMessage Alert: SBI YONO బ్లాక్ అవుతుందంటూ నకిలీ మెసేజ్లు

హిడ్మా మృతి నిర్ధారణ
దీర్ఘకాలం కొనసాగిన ఈ ఆపరేషన్లో ఆరుగురు మావోయిస్టులు(Maoist Encounter) మృతి చెందారు. వారిలో మావోయిస్టుల కేంద్ర కమిటీ కీలక నేత హిడ్మా కూడా ఉన్నారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. భద్రతా బలగాలకు సుదీర్ఘకాలంగా సవాలుగా నిలిచిన హిడ్మాను ఈ ఎదురుకాల్పుల్లో పోలీసులు మట్టుబెట్టారు.
ఏపీ–తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఈ ఆపరేషన్లో హిడ్మాతో పాటు ఆయన భార్య సహా మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. హిడ్మాపై రూ. 1 కోటి, ఆయన భార్యపై రూ. 50 లక్షల రివార్డ్ ఉంది. వారం క్రితమే హిడ్మా తల్లిని ఛత్తీస్గఢ్ హోంమంత్రి పరామర్శించిన విషయం తెలిసిందే. మాడ్వి హిడ్మి అసలు పేరు సంతోష్/హిడ్మన్న. 25 ఏళ్ల క్రితం అడవులకు వెళ్లిన అతను తిరిగి రావాలని అతని తల్లి పిలుపునిచ్చినప్పటికీ, తిరిగి రాలేదు.
ప్రస్తుతం సంఘటన స్థలంలో ఇంకా కాల్పుల అవకాశాన్ని పరిశీలిస్తూ భద్రతా బలగాలు భారీగా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై అధికారులు అదనపు దృష్టి సారించారు.
హిడ్మా నేపథ్యం – 27 కేసులు
సుక్మా జిల్లా జేగురుగుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని పువర్తి హిడ్మా స్వగ్రామం. వయస్సు 55 ఏళ్లు. 10వ తరగతి వరకే చదివిన అతను హిందీ, కోయ భాషల్లో మాట్లాడగలడు. బాలల సంఘం నుంచి మావోయిస్టు పార్టీలో చేరి క్రమంగా ఎదిగి పీఎల్జీఏ ప్లాటూన్–1 కమాండర్గా, స్టేట్ మిలిటరీ కమాండర్గా పనిచేశాడు.
హిడ్మా ఆధ్వర్యంలో సుమారు 150 మంది కమాండర్లు పనిచేసేవారు. 5 కిలోమీటర్ల పరిధిలో మూడు చక్రాల దృఢమైన భద్రత వలయం ఉండేది. పువర్తి, జేగురుగుండా, తెర్రం, గుండం, కోవరగట్ట, కొండపల్లి గ్రామాల్లో అతనికి బలమైన నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు.
మొత్తం 27 కేసుల్లో హిడ్మా నిందితుడిగా ఉన్నాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: