ప్రఖ్యాత సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సభ్యులు అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు. ఇటీవల వారణాసి(Varanasi) సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హనుమంతుడి గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల ధార్మిక భావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపిస్తూ, హైదరాబాద్ సరూర్నగర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన వానరసేన ప్రతినిధులు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు!
Varanasi: వాణిజ్య ప్రయోజనాల కోసం దేవుళ్లను వివాదాస్పదంగా ఉపయోగించడం సరికాదని, రాజమౌళి వంటి ప్రముఖ వ్యక్తులు చేసిన వ్యాఖ్యలకు ప్రభావం త్వరగా వ్యాప్తి చెందుతుందని వానరసేన సభ్యులు పేర్కొన్నారు. హనుమంతుడిపై అనుచితంగా మాట్లాడటం హిందూ సమాజాన్ని అవమానించడం వంటిదని, ఇది సహించలేనిదని వారు స్పష్టం చేశారు.ఫిర్యాదు అందుకున్న పోలీసులు విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. సంబంధిత వీడియోలు, ప్రకటనలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారని తెలిసింది.

రాష్ట్రీయ వానరసేన(Rashtriya Vanarasena) ప్రతినిధులు మాట్లాడుతూ “హిందూ దేవుళ్లపై ఎవరైనా నిర్లక్ష్యంగా, అవివేకంగా వ్యాఖ్యలు చేస్తే అది సమాజంలో అశాంతికి దారి తీస్తుంది. రాజమౌళిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన హెచ్చరిక ఇవ్వాలి” — అని వారు అన్నారు.
ఈ ఘటనతో రాజమౌళి మళ్లీ వివాదాల కేంద్రమయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది రాజమౌళిని విమర్శిస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంటున్నారు.సినీరంగం, రాజకీయ వర్గాలు, హిందూ సంస్థల్లో ఈ ఘటనపై చర్చ నడుస్తుండగా, రాజమౌళి ఈ అంశంపై స్పందిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: