4,000 మెగావాట్ల స్టేజ్-2 నిర్మాణానికి రెడీ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ (NTPC) లిమిటెడ్ కు చెందిన 2600 మెగావాట్ల రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ దక్షిణాది విద్యుత్ అవసరాలను తీర్చడం లో కీలక పాత్ర పోషిస్తున్నది. అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం యేటా ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రోజుకు 42 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. 2100 మెగావాట్ల సామర్థం ఉన్న స్టేజ్ 1, స్టేజ్ 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి నుంచి రోజుకు 32వేల మెట్రిక్ టన్నుల కోల్ లింకేజీ ఒప్పందం ఉంది. అలాగే స్టేజ్ 3లోని 500 మెగావాట్ల 7 యూనిట్ కు ఒడిశాలోని మహానది కోల్ఫీల్డ్స్ నుంచి 8వేల మెట్రిక్ టన్నుల బొగ్గు లింకేజీ ఒప్పందం ఉంది.
Read also: BREAKING NEWS: సౌదీ రోడ్డు ప్రమాదంలో 42మంది దుర్మరణం

Power Generation: 2600 MW NTPC power for southern states
800 మెగావాట్ల
ప్రాజెక్టు అవసరమైన 6.5 టీఎంసీల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నిల్వ ఉంచుతారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు 754 మెగావాట్లు (29 శాతం), తమిళనాడుకు 572 మెగావాట్లు (22శాతం), కర్నాటకకు 416 మెగావాట్లు (16శాతం), కేరళకు 312 మెగావాట్లు (12శాతం), గోవాకు 130 మెగావాట్లు (5శాతం), పాండిచ్చేరికి 52 మెగావాట్లు (2శాతం) సరఫరా చేస్తోంది. కాగా టిఎస్టి టిపిపి స్టేజ్ 2 నిర్మాణానికి రెడీ అవుతోంది. 2600 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ఆవ రణ లోనే 4000 మెగావాట్ల మరో ప్రాజెక్టును నిర్మిస్తోంది. మొదటి దశలో 800 మెగావాట్ల రెండు యూనిట్లు గత ఏడాదిలో పూర్తయి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. స్టేజ్ 2 కింద మరో 2400 మెగావాట్ల ప్లాంటు నిర్మించేందుకు అంతా సిద్ధం చేస్తోంది. ఎవరికీ కేటాయించనిది (అన్ అలాటెడ్) 364 మెగావాట్ల (14 శాతం)గా ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: