అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో రాబోయే ప్రతిష్ఠాత్మక చిత్రం అధికారికంగా వారణాసి’గా ప్రకటించబడింది. చిత్ర యూనిట్ శనివారం ‘వారణాసి టు ద వరల్డ్’ పేరుతో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసి మహేశ్ బాబును ‘రుద్ర’ అనే శక్తిమంతమైన పాత్రలో పరిచయం చేసింది. ఈ ప్రకటనతో సినిమాపై అభిమానులు, సినీ విశ్లేషకుల అంచనాలు భారీగా పెరిగాయి.
Read Also: Ramoji Rao: నేడు రామోజీ ఎక్స్లెన్స్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమం
హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో(Ramoji Filmcity) నిర్వహించిన ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్లో చిత్ర యూనిట్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ సినిమాలో మహేశ్ బాబు(Mahesh Babu) సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారని, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారని తెలిపారు. అలాగే, ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారని తెలిపారు.
నిర్మాతలు, బడ్జెట్ మరియు సోషల్ మీడియాలో రచ్చ
చిత్రాన్ని కేఎల్ నారాయణ, శ్రీ దుర్గా ఆర్ట్స్ సమర్పణలో, షోయింగ్ బిజినెస్ బ్యానర్పై ఎస్ఎస్ కార్తికేయతో కలిసి అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ ప్రకటనతో #వారణాసి హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. ‘వారణాసి టు ద వరల్డ్’ వీడియో నెట్టింట కూడా భారీ హైప్ సృష్టిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: