తెలుగు రాష్ట్రాల్లో శీతల గాలులు ప్రభావం చూపడంతో చలి (Weather) తీవ్రత స్థాయిలో పెరుగుతోంది. రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం వలన ప్రజలు వణికిపోతున్నారు. గత వారం తో పోలిస్తే 3 నుండి 5 డిగ్రీల వరకు తగ్గిపోవడం గమనార్హం. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ చలి (Weather) మరింతగా ప్రభావం చూపుతోంది.
Read Also: TG: SIR నిర్వహణకు సిద్ధం కండి: సీఈవో

అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు
దీంతో APలోని అల్లూరి(D) అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదయ్యాయి. TGలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: