టెలంగాణా (TG) లో ఓటర్ల జాబితా సవరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తాజాగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిహార్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలను ఆదర్శంగా తీసుకుని, అదే తరహా ప్రక్రియను త్వరలో టెలంగాణాలో కూడా అమలులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also: Jubilee Hills: నీ కర్మ మిమల్ని ఓడించింది..KTR కాంగ్రస్ నేత ఆగ్రహం

SIR నిర్వహణకు పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను యంత్రాంగం యథావిధిగా పూర్తి చేయాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈఆర్వోలు, ఏఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. SIR నిర్వహణకు పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: