బీహార్ (Bihar) లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి స్పష్టమైన విజయాన్ని సాధించినప్పటికీ, సీఎం కుర్చీపై పెద్ద చర్చ నడుస్తోంది. ఎన్డీయే భాగస్వామ్యం అయిన జేడీయూ (JDU) అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దీంతో సహజంగానే నితీశ్ కుమారే సీఎం అవుతారని అందరు భావించారు..
Read Also: Bihar Result: ఓట్ల షేర్ లో ఆర్జేడీదే ఆధిక్యం..ఐన ఓటమి
కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. బీహార్ లో నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.జేడీయే అధిపతి నితీశ్ కుమార్ బీహార్ లో 20కు పైగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అయితే ఈ సారి కూడా ఆయనే సీఎం చేయడానికబీజేపీ సిద్ధంగా లేదు.
బిహార్ (Bihar) లో ఎడ్డీయేని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు కూడా బాగా పని చేశారు. దీంతో ఈసారి సీఎం కుర్చీ కమలం పువ్వు నాయకులే కావాలని పట్టుబట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రధాని మోదీ లాంటి వారు కూడా నితీశ్ కాకుండా బీజేపీ అభ్యర్ధికి పట్టం కట్టాలని అనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది.

మహారాష్ట్ర ఫార్ములాను ప్రయోగిస్తారనే టాక్
అందుకే మొదటి నుంచీ ఎన్డీయే కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించలేదు. మరోవైపు బీహార్ లో కూడా మహారాష్ట్ర ఫార్ములాను ప్రయోగిస్తారనే టాక్ వినిపిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ముందుగా ముఖ్యమంత్రిని ప్రకటించలేదు. మెజార్టీ సీట్లు వచ్చాక పొత్తులొ భాగమైన శివసేనా అభ్యర్థి షిండేని కాకుండా బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్కి అవకాశం ఇచ్చారు.
చిరాగ్ పాశ్వాన్ సీఎం
ఇప్పుడు బీహార్ లో కూడా దీనినే అమలు చేస్తారని అంటున్నారు. బీజేపీ అభ్యర్థి చిరాగ్ పాశ్వాన్ ను (Chirag Paswan) సీఎం చేస్తారని అంటున్నారు. అలాగే తెరపైకి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు కూడా వచ్చింది. ఈ సారి ఎలా అయినా బీహార్ లో బీజేపీ తన ఆధిక్యాన్ననిలబెట్టుకోవాలని అనుకుంటోంది అందుకే వీరిద్దరిలోఎవరినో ఒకరిని ముఖ్యమంత్రి చేస్తుందని వార్థులు వినిపిస్తుననాయి.
ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోపోవచ్చని
దానికి తోడు నితీశ్ కుమార్ వయసు రిత్యా, బాధ్యతల ఒత్తిడి దృష్యా ఆయన ఈసారి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక బీహార్ ఎన్నిక (Bihar Election 2025) ల్లో ఈసారి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జన్శక్తి పార్టీ(రామ్ విలాస్) అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ ఎన్నికల్లో ఎల్జేపీ 29 స్థానాల్లో పోటీ చేయగా 23 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రికెట్లో రవీంద్ర జడేజా చివరి ఓవర్లలో మ్యాచ్ను గెలిపించినట్లే.. చిరాగ్ పాస్వాన్ (Chirag Paswan) కూడా ఎన్డీయే తరఫున ఇలాంటి పాత్రే పోషించినట్లు ఆయనపై ప్రశంసలు వస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: