మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును(Harish Rao) మరోసారి తీవ్రంగా టార్గెట్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ స్థాయిలో కుట్రలు జరిగాయని, సరైన సందర్భంలో అన్ని విషయాలను బయటపెడతానని ఆమె స్పష్టం చేశారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం కూచన్పల్లిలో పాడి రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన కవిత, పార్టీ అంతర్గత వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Jublieehills Results: అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం పై KTR కౌంటర్!

“బీఆర్ఎస్ కిందిస్థాయిలో పని చేయలేదు” – కవిత
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్(KCR) ఊహించిన స్థాయిలో పని చేయలేదని, నిజంగా ప్రజల కోసం కష్టపడి ఉంటే ఫలితాలు పూర్తిగా వేరేలా వచ్చేవని కవిత విమర్శించారు.
సోషల్ మీడియాలో మాత్రమే చురుకుగా కనిపించడం తప్ప గ్రౌండ్లో పనితీరు చూపలేదని ఆమె అన్నారు. హరీష్ రావు–కేటీఆర్లు కృష్ణార్జునుల్లా సోషల్ మీడియా ప్రచారంలో మునిగిపోయారని వ్యాఖ్యానించారు.
హరీష్ రావుపై భూమి, రింగ్ రోడ్ మార్పుల ఆరోపణలు
రెడ్డిపల్లిలో 400 ఎకరాల ఫార్మ్హౌస్ కోసం రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చించారని హరీష్రావుపై కవిత ఆరోపించారు. కేసీఆర్కు తెలియకుండా ఈ మార్పులు జరిపారని, ఇవన్నీ వెలుగులోకి వస్తే ఆయన అసలు ఉపేక్షించరని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేసిన అక్రమాలకు హరీష్ రావే అండగా ఉన్నారని కూడా కవిత ఆరోపించారు. హరీష్ రావు కుటుంబం ప్రైవేటుగా పాల వ్యాపారాలు చేస్తూ రైతులను నష్టపరిచారని, టెండర్లేమీ లేకుండానే హాస్టళ్లకు పాలు సరఫరా చేసి లాభాలు ఆర్జించారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన కవిత, కేసీఆర్(KCR) పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన బయటకు వచ్చిన తరువాత రాజకీయ పరిస్థితులు మారిపోతాయని తెలిపారు.
కేసీఆర్పై అవాస్తవ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని రేవంత్కు హితవు పలికారు.మెదక్లో బీఆర్ఎస్ తగ్గిపోవడానికి స్థానిక నేతల అంతర్గత విభేదాలే కారణమని కవిత వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: