
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న (IND vs SA) తొలి టెస్టు మొదటి రోజే టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో బుమ్రా 27 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు.
Read Also: Shardul Thakur: ఐపీఎల్ లో మూడు సార్లు ట్రేడ్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా శార్దూల్
టాస్ గెలిచిన బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా (IND vs SA) కు ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్(31), ర్యాన్ రికెల్టర్(23) శుభారంభం అందించారు. వన్డే తరహా బ్యాటింగ్తో దూకుడుగా ఆడిన ఈ జోడీ తొలి వికెట్కు 57 పరుగులు జోడించింది. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని జస్ప్రీత్ బుమ్రా విడదీసాడు. ర్యాన్ రికెల్టన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
తన మరుసటి ఓవర్లో మార్క్రమ్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ టెంబా బవుమా(3)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చగా.. టోనీ డీ జోర్జితో కలిసి వియాన్ మల్డర్ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దాంతో సౌతాఫ్రికా 105/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
నాలుగో వికెట్కు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యానికి
రెండో సెషన్లో భారత బౌలర్లు చెలరేగారు. వియాన్ మల్డర్ను కుల్దీప్ యాదవ్ వికెట్ల ముందు బోల్లా కొట్టించాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కైల్ వెర్రెన్(16), మార్కో జాన్సెన్(0)లను సిరాజ్ ఒకే ఓవర్లో ఔట్ చేయడంతో సౌతాఫ్రికాకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
కార్బిన్ బోచ్(5)ను అక్షర్ పటేల్ వికెట్ల ముందు బోల్తా కొట్టించగా సౌతాఫ్రికా 154/8తో టీ బ్రేక్ వెళ్లింది. మూడో సెషన్ ఆరంభంలోనే మూడు బంతుల వ్యవధిలోనే సిమన్ హర్మర్(5), కేశవ్ మహరాజ్(0)లను బుమ్రా ఔట్ చేసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్కు తెరదించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: