బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల (Bihar Election Results) లెక్కింపు శుక్రవారం (నవంబర్ 14) ఉదయం క్రమంగా ప్రారంభమైన వెంటనే అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొదటి నుంచే వచ్చిన ట్రెండ్స్ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. ముఖ్యంగా దర్భంగా జిల్లాలోని అలింగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ప్రముఖ ఫోక్ సింగర్, బీజేపీ అభ్యర్థి మైథిలి ఠాకూర్ ముందంజలో ఉన్నారు. 3794 ఓట్లతో మైథిలి ఠాకుర్ ముందంజలో ఉన్నారు.
Read Also: Bihar Elections: ఎన్డీఏ భారీ ఆధిక్యం – AIMIMకు పెద్ద షాక్
దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న గాయని
ప్రారంభ రౌండ్లలో వచ్చిన లెక్కింపు వివరాల ప్రకారం, మైథిలి ఠాకూర్ తన ప్రధాన ప్రత్యర్థులపై చెప్పుకోదగిన లీడ్ను కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న 25 ఏళ్ల ఈ యువ గాయని, తన గాన ప్రతిభతో పాటు స్థానిక ‘మిథిలాంచల్’ సంస్కృతిపై ఆమెకున్న పట్టుతో ప్రజల్లోకి దూసుకువెళ్లారు.
ఎన్నికల ప్రచారంలో ఆమె యువత, మహిళా సాధికారత, విద్యాభివృద్ధి వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.బీహార్ (Bihar Election Results) లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేతృత్వంలోని మహాఘట్బంధన్ (MGB) కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. మైథిలి ఠాకూర్ ఆధిక్యం బీజేపీలో ఉత్సాహాన్ని నింపుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: