ఆమధ్య భార్య పేరుపై భారీ ఇన్సూరెన్స్(Insurance) ఉందని గ్రహించిన భర్త ఆ డబ్బుకోసం ఏకంగా ఆమెనే హతమార్చాడు. మరో సుపుత్రుడు అయితే తండ్రి మరణిస్తే ఇన్సూరెన్స్ వస్తుందని కన్నతండ్రి అని కూడా చూడకుండా చంపేశాడు ఆ కర్కోఠకుడు. డబ్బుకోసం ఏమైనా చేస్తారు.. ఎంతకైనా తెగిస్తారు.
ఆస్తుల కోసం కన్నవారినే హతమార్చుకునే విషసంస్కృతిలో జీవిస్తున్నాం.ఒకప్పుడు అనుబంధాల కోసం ప్రాణాలను ఇచ్చేవారు. కుటుంబాల మధ్యల ప్రేమానురాగాలు ఇంట్లో తాండవం ఆడేవి. కానీ నేడు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఇన్సూరెన్స్ కోసం కోళ్లను వదిలేశాడు.
Read Also: IPL-2026: మినీ వేలంలో పాల్గొననున్న CSK?

కోళ్లను వదిలేసిన కోళ్ల ఫారం యజమాని
హన్మకొండ(Hanmakonda) జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కొద్దిరోజుల క్రితం వందల సంఖ్యలో నాటుకోళ్లను దుండగులు వదిలేసి వెళ్లారు. దీంతో స్థానికులంతా ఆ కోళ్లను తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. అయితే ఆ కోళ్లను(Hens) తినొద్దని వైద్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే యజమాని కోళ్లను వదిలేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దాదాపు రెండువేల కోళ్లను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి-సిద్ధిపేట జాతీయ రహదారిపై ఈ కోళ్లను వదిపెట్టారు. వీటికోసం ప్రజలు పోటీపడి మరీ పట్టుకెళ్లారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: