ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. తన కార్యాలయంలో NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), IB (ఇంటెలిజెన్స్ బ్యూరో) చీఫ్లతో సమావేశమై దర్యాప్తు పురోగతిపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేలుడు వెనుక ఉన్న కుట్రలపై స్పష్టతకు దర్యాప్తు బృందాలకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం.
Read Also: Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం

సాయంత్రం మరోసారి రివ్యూ మీటింగ్
మధ్యాహ్న భేటీ(Amith Shah) అనంతరం, సాయంత్రం మరోసారి కీలక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో కేంద్ర భద్రతా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.
ఫరీదాబాద్-ఢిల్లీ లింక్పై దర్యాప్తు వేగం
పేలుడు ఘటనకు సంబంధించి ఫరీదాబాద్-ఢిల్లీ లింక్ కోణంలో NIA అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. దర్యాప్తు విస్తృతంగా కొనసాగుతోందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: