తెలంగాణ రాష్ట్రంలో మొంథా తుఫాన్ (Montha Cyclone) రైతుల జీవితాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలు, గాలివానలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టంపై వ్యవసాయ శాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదిక ప్రకారం మొత్తం 1,17,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు స్పష్టమైంది. రైతులు భారీగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితిలో ప్రభుత్వం వారికి అండగా నిలవాలని సంకల్పించింది.
Read Also: Fish Curry : ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో ఫిష్ కర్రీస్- మంత్రి శ్రీహరి

ఈ నివేదిక వివరాలను
అత్యధికంగా నాగర్ కర్నూల్లో 23,580, వరంగల్లో 19,736 ఎకరాల నష్టం వాటిల్లినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందాన్ని పర్యటించమని కోరామన్నారు. దెబ్బతిన్న పంటలకు త్వరలోనే ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: