ఢిల్లీలో(Delhi) ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్లో(Blast) దేశంలో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. కాగా ఈ బాంబు దాడిలో 12మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా,(Haryana) హిమాచల్ ప్రదేశ్ లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.
పోలీసు కమిషనర్లు, సీనియర్ సూపంటెండెంట్లు అప్రమత్తంగా ఉండాలని కూడా డీజీపీ తెలిపారు. ఢిల్లీలో సంఘటన జరగడంతో భద్రతా దృష్ట్యా డీజీపీ ఈ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా వస్తువులు కనిపించినా కూడా వెంటనే 112కు కాల్ చేయాలని తెలిపారు.
Read also: Andesri Funeral: అందెశ్రీకి కన్నీటి నివాళి.. పాడె మోసిన సీఎం

అసత్య వార్తల్ని నమ్మవద్దు..
సోషల్ మీడియా(Social media) ప్లాట్ ఫామ్లలో ప్రజలు భయపడవద్దని, నమ్మవద్దని లేదా పుకాట్ల లేదా ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని కూడా సూచించారు. అలాగే రద్దీగా ఉండే లేదా సున్నితమైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, భద్రతా తనిఖీల సమయంలో పోలీసులతో పూర్తిగా సహకరించాలని సూచించారు.
నిన్న సాయంత్రం ఢిల్లీలో 6.50 నిమిషాలకు కారు పేలుడు జరిగింది. ఉద్యోగస్తులు, కాలేజీ విద్యార్థులు తమ పనులను ముగించుకుని, ఇండ్లకు వెళ్లే సమయాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. భారీ పాణనష్టానికి కుట్రపడినట్లుగా ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: