మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం మంగళవారం 72వ రోజుకు చేరింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ సమస్యలను మంత్రి ముందు ఉంచారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విన్న లోకేశ్, ప్రతి అర్జీని స్వయంగా స్వీకరించారు.
Read also: Anantapur: తాడిపత్రిలో కలకలం..! వైసీపీ నేతపై దాడి

AP: మంగళగిరిలో మంత్రి లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం
ప్రజల్లో సంతోషం
కొందరి సమస్యలపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన చోట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, వారికి న్యాయం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. అందిన ప్రతి విజ్ఞప్తిని జాగ్రత్తగా పరిశీలించి, పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి స్పందనతో ప్రజల్లో సంతోషం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: