దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలపై(Road accident) సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్ల పక్కన అనుమతి లేకుండా నడుస్తున్న దాబాలు, రహదారుల నిర్వహణలో నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని వ్యాఖ్యానించింది.
సుప్రీం కోర్టు ఈ రెండు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన హైవే ప్రమాదాలపై సుమోటో విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మరియు కేంద్ర రవాణా శాఖ నుంచి సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.
Read also: అలిపిరి మెట్లమార్గంలో మటన్ ముక్కలు.. అవాక్కైన భక్తులు

హైవేల్లో దాబాల సర్వేకు ఆదేశాలు
జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం తెలిపిన వివరాల ప్రకారం రహదారులపై ఉన్న అనుమతి లేని దాబాల సంఖ్యను సర్వే చేయాలని, అలాగే రోడ్ల పరిస్థితులపై పూర్తి వివరాలను సమర్పించాలని సూచించింది.
మెయింటెనెన్స్ పనులు చేపట్టే కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో కూడా రిపోర్ట్ చేయాలని సుప్రీంకోర్టు(Road accident) ఆదేశించింది. హైవేల పక్కన ఉన్న దాబాలకు వెళ్లేందుకు ట్రక్కులు రోడ్డుపై ఆగిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది.
టోల్ వసూళ్లు రోడ్ల నాణ్యతపై ప్రశ్నలు
టోల్ చార్జీలు వసూలు చేస్తున్నా, రోడ్ల నాణ్యత దారుణంగా ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైవేల్లో జరిగే అవకతవకలు ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టంగా పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: