సుప్రీంకోర్టు (supreme court) లో పిన్నెల్లి సోదరులకు దొరకని ఊరట పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డ ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సర్వోన్నత న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది. ఈరోజు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఇరపక్షాల వాదనలను విన్నది. అనంతరం తదుపరి విచారణను రెండువారాల తర్వాత జరుపుతామని స్పష్టం చేసింది.
Read also: Kadapa Crime: 9 వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తత

సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులకు దొరకని ఊరట
బెయిల్ లభిస్తుందని ఆశించిన సోదరులు
నేటి విచారణలో తమకు కచ్చితంగా బెయిల్ లభిస్తుందని ఆశించిన పిన్నెల్లి సోదరులకు ఈ పరిణామం నిరాశ కలిగించింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మే 25న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. అందరిపైనా ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: