हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News:Ande sri:అందెశ్రీ కన్నుమూతపై సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి

Pooja
Telugu News:Ande sri:అందెశ్రీ కన్నుమూతపై సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి

తెలంగాణ ప్రజల కవి, సాహితీ శిఖరం అందెశ్రీ(Ande sri) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సాహిత్య ప్రపంచానికే కాకుండా వ్యక్తిగతంగా కూడా తనకు తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన కలాన్ని ఆయుధంగా మార్చి ప్రజల్లో చైతన్య జ్వాలలు రగిలించిన యోధుడని గుర్తుచేశారు. పేదల పక్షాన ఎల్లప్పుడూ నిలిచిన నిస్వార్థ కవిగా అందెశ్రీ(Ande sri) పేరెన్నికగన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అధికార గీతం “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” రూపంలో ఆయన శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Read Also: Ande Sri: గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

Ande sri
Ande sri

కేసీఆర్ సంతాపం – ఉద్యమ కవికి ఘన నివాళి
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) కూడా అందెశ్రీ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఉద్యమానికి అందెశ్రీ అందించిన స్ఫూర్తిదాయక కృషిని ఆయన గుర్తుచేశారు. పాటలతో, సాహిత్యంతో తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో చైతన్యం రగిలించిన కవిగా అందెశ్రీ నిలిచారని తెలిపారు. ఉద్యమ దశలో అందెశ్రీతో తానున్న సాన్నిహిత్యాన్ని స్మరించుకుంటూ, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. దివంగత కవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

హరీష్ రావు సంతాపం – సాహితీ ప్రపంచానికి తీరని నష్టం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు కూడా అందెశ్రీ మరణాన్ని బాధాకరంగా అభివర్ణించారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

కవి అందెశ్రీ జీవితం – తెలంగాణ సాహిత్య చరిత్రలో చిరస్థాయి స్థానం
అనారోగ్యంతో బాధపడుతున్న అందెశ్రీ ఆదివారం ఉదయం స్వగృహంలో స్పృహ తప్పి కుప్పకూలగా, గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్” వంటి పద్యాలతో తెలంగాణ మట్టివాసనను సాహిత్యంలో నిలబెట్టిన కవిగా అందెశ్రీ గుర్తింపు పొందారు.
ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

అందెశ్రీ గౌరవాలు, పురస్కారాలు

  • 2014 – అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్
  • 2015 – దాశరథి సాహితీ పురస్కారం
  • 2015 – రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం
  • 2022 – జానకమ్మ జాతీయ పురస్కారం
  • 2024 – దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్‌నాయక్ పురస్కారం

ప్రజాకవి అందెశ్రీ మరణం తెలంగాణ ప్రజల హృదయాల్లో లోటు నింపలేని బాధగా నిలిచింది. ఆయన కవిత్వం, తెలంగాణ భాషా ప్రేమ, ఉద్యమ స్ఫూర్తి ఎప్పటికీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు

పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు

📢 For Advertisement Booking: 98481 12870