తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) దేశవ్యాప్తంగా సైబర్ నేరాల(Cyber Crime)పై భారీ ఆపరేషన్ చేపట్టి మరోసారి తన దృఢతను చాటింది. ఐదు రాష్ట్రాల్లో ఒకేసారి నిర్వహించిన ఈ ఆపరేషన్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న 81 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారు ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ నిందితులపై దేశవ్యాప్తంగా మొత్తం 754 కేసులు నమోదై ఉండగా, వారు దాదాపు రూ.95 కోట్ల మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
Read Also: CM Revanth Reddy: కేసీఆర్ పథకాలు రద్దు చేయలేదు, కొత్త పథకాలు తీసుకొచ్చాం

ఏజెంట్లు, మహిళలు, బ్యాంకు ఉద్యోగులు కూడా నిందితులలో
పట్టుబడిన వారిలో 17 మంది ఏజెంట్లు, ఏడుగురు మహిళలు ఉన్నారని సైబర్ సెక్యూరిటీ(Cyber Crime) అధికారులు తెలిపారు. అలాగే 58 మంది మ్యూల్ ఖాతాదారులను కూడా గుర్తించారు. వారి వద్ద నుంచి 84 మొబైల్ ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంక్ పాస్బుక్లు, చెక్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న కోట్ల రూపాయలను ఇప్పటికే ఫ్రీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని త్వరలోనే మోసపోయిన బాధితులకు తిరిగి అందజేయనున్నట్లు చెప్పారు.
వివిధ రంగాల వ్యక్తులు ఈ నేరాలలో భాగస్వాములు
దర్యాప్తులో నిందితులలో బ్యాంకు సిబ్బంది, ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ రంగం సిబ్బంది, బ్రోకర్లు, విద్యార్థులు, రోజువారీ కూలీలు కూడా ఉన్నట్లు తేలింది. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు 106 కేసులకు నేరుగా సంబంధమున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు ఈ ఆపరేషన్లో ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో 41 కేసులు నమోదు అయ్యాయి.
విదేశీ లింకులు, లుక్ అవుట్ సర్క్యులర్ల జారీ
కొంతమంది నిందితులకు విదేశీ సంబంధాలు ఉన్నట్లు TGCSB గుర్తించింది. అందువల్ల వారికి వ్యతిరేకంగా లుక్ అవుట్ సర్క్యులర్లు (LOCs) జారీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సైబర్ మోసాలను అరికట్టడంలో ఈ ఆపరేషన్ ఒక ప్రధాన మైలురాయిగా నిలిచిందని సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖ గోయల్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: