బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) ప్రారంభమై ఇప్పటికే 61 రోజులు గడిచాయి. ఇంకా ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో పోటీ మరింత ఉత్కంఠగా మారింది. హౌస్లో మిగిలిన కంటెస్టెంట్లు ఇప్పుడు సేఫ్ గేమ్ నుంచి బయటపడి, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. ఈ వారం మొత్తం హౌస్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
Read Also: Bigg boss: భరణి రీ-ఎంట్రీతో హౌస్లో కొత్త హంగామా!
సేఫ్ గేమ్ నుంచి బయటపడే ప్రయత్నాలు గట్టిగా సాగుతున్నాయి. ప్రతి రోజు కొత్త టర్న్ తీసుకుంటున్న షోలో శుక్రవారం ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. డీమాన్ పవన్, రీతూ చౌదరి మధ్య దూరం పెరిగింది. వీరు ఇద్దరూ మాట్లాడుకోకపోవడంతో హౌస్లో కొత్త టాపిక్ మొదలైంది. రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్ వీరిపై సరదా సెటైర్లు పేలుస్తూ నవ్వులు పూయించారు.
సాధారణంగా సైలెంట్గా ఉండే రాము కూడా ఈసారి పంచ్లతో ఎంటర్టైన్ చేశాడు. ‘ఒంటరైన పక్షి’ అంటూ పవన్పై వేసిన పంచ్ ఎపిసోడ్ హైలైట్గా నిలిచింది. రీతూ కూడా ఈ సరదా మూమెంట్లో భాగమవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బిగ్ బాస్ (Bigg Boss 9) పదవ వారానికి కెప్టెన్సీ టాస్క్ ప్రకటించాడు. కంటెస్టెంట్లు రెండు ట్రైన్లలో ఎక్కి డ్రైవర్ సీట్ దక్కించుకునే పోటీ ప్రారంభమైంది.

చివరగా సీట్ దక్కించుకున్న దివ్య
మొదట సీట్ దక్కించుకున్న రాము రాథోడ్ (Ramu Rathod) భరణిని తొలగించగా, తర్వాత శ్రీనివాస సాయి దివ్యను, నిఖిల్ సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు. చివరగా సీట్ దక్కించుకున్న దివ్య తనూజను టాస్క్ నుంచి తొలగించింది. దీంతో తనూజ ఆగ్రహంతో దివ్యపై విరుచుకుపడింది. “భరణి కారణంగానే నన్ను తొలగించావు, పర్సనల్ కక్షతో అలా చేసావు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమె ఏడుస్తూ రూమ్లోకి వెళ్లిపోవడంతో హౌస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భరణి, రీతూ, ఇతర కంటెస్టెంట్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.అయితే ,స్ట్రాంగ్ కంటెస్టెంట్ లా అడుగుపెట్టాడు భరణి. అప్పటికే సీరియల్స్, సినిమాల ద్వారా బయట మంచి పాపులారిటినీ సొంతం చేసుకున్న భరణి.. హౌస్ లోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత మూడు వారాలు తన ఆటతో అదరగొట్టాడు.
నెమ్మదిగా బంధాల మధ్యలో చిక్కుకున్నాడు
కానీ తనూజ ఎప్పుడైతే నాన్న నాన్న అంటూ గేమ్ స్టార్ట్ చేసిందో అప్పుడే భరణి ఆట దారి తప్పింది. నెమ్మదిగా బంధాల మధ్యలో చిక్కుకున్నాడు.ఇక దివ్య ఎంట్రీ తర్వాత భరణి పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. అటూ తనూజ, ఇటు దివ్య మధ్య నలిగిపోయాడు. దీంతో అదే బంధాల విషయంతో ఎలిమినేట్ సైతం అయ్యాడు.
అయితే జనాలు రెండో ఛాన్స్ ఇచ్చి మరోసారి భరణిని లోపలికి పంపించినప్పటికీ మరోసారి తనూజ, దివ్య మధ్య ఇరుక్కుపోయాడు భరణి. టాస్కులు, నామినేషన్స్.. ఇలా ప్రతి చిన్న విషయంలో భరణి కోసం కొట్టుకుంటున్నారు దివ్య, తనూజ. ఒకరితో మాట్లాడితో మరొకరు అలగడం.. చివరకు భరణి బుజ్జగించడం ఇదే పరిస్థితి.ఇక ఇంట్లో ఈ వారం కెప్టెన్ గా ఇమ్మూ గెలిచాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: