DCM Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. శనివారం నాడు తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించి, అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నేరుగా అడవిలోకి వెళ్లి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ అటవీ మార్గంలో నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. అనంతరం వాహనం దిగి దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన అడవి లోపలికి వెళ్లారు.


మామండూరు అడవుల్లో కాలినడకన ప్రయాణం – అటవీ మార్గంలో నాలుగు కిలోమీటర్లకు పైగా నడిచిన పవన్ కల్యాణ్.




అటవీ మార్గంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(DCM Pawan Kalyan) – ప్రతి చెట్టును ఆసక్తిగా గమనిస్తూ అధికారులతో మాట్లాడిన సందర్భం.



గుంటి మడుగు వాగు వద్ద కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ప్రకృతి సోయగాలను ఆస్వాదించిన పవన్ కల్యాణ్.




వాచ్ టవర్పై నిలబడి అడవీ ప్రాంతాన్ని వీక్షిస్తున్న మంత్రి పవన్ కల్యాణ్ – శేషాచలం, వెలిగొండ సరిహద్దులు పరిశీలన.

మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటుతున్న మంత్రి పవన్ కల్యాణ్ – పచ్చదనానికి ప్రాధాన్యత.


తిరుపతి జిల్లా మంగళంలోని ఎర్రచందనం గొడౌన్ను పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్ – రికార్డులు, బార్ కోడింగ్ సిస్టమ్పై సమీక్ష.


ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణ చర్యలపై అటవీ అధికారులతో సమీక్ష జరుపుతున్న పవన్ కల్యాణ్.అధికారులతో చర్చల సందర్భంగా అటవీ సంరక్షణపై పలు సూచనలు చేస్తున్న పవన్ కల్యాణ్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: