చైన్ కు చెక్ పెట్టేందుకేనా?
అమెరికా-చైనా(China) వాణిజ్య సంబంధాల మధ్య నెలకొన్న అస్థిరత ప్రపంచ సరఫరా గొలుసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (ఆవీఎస్), రక్షణ వ్యవస్థలు, పునరుత్పత్తి శక్తి రంగాలు వంటి విభాగాల్లో వ్యూహాత్మక పాధాన్యత పొందాయి. ఈ నేపథ్యంలో పొరుగుదేశం చైనాపై గల అధిక ఆధారాన్ని తగ్గించుకోవడం ఇప్పుడు అన్ని ప్రధాన దేశాల లక్ష్యంగా మారింది.
Read Also: Viral Video: ఆప్యాంగా ఆలింగనం చేసుకున్న రేవంత్ రెడ్డి, బాలయ్య

రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది కేంద్రం.
ఈ సందర్భంగా భారతదేశం రేర్ ఎర్త్ మీద తీసుకుంటున్న కొత్త చర్యలు, పెట్టుబడులు, విధాన మార్పులు దేశ భద్రతా, ఆర్థిక, సాంకేతిక స్వావలంబన వైపు కీలకమైన అడుగులు వేస్తున్నాయి.వేగంగా అయస్కాంతాల నిల్వలను నిర్మించుకునే యత్నం భారతదేశం ప్రస్తుతం తన అరుదైన భూమి అయస్కాంతాల నిల్వలను నిర్మించుకుని దిశగా వేగంగా కదులుతోంది. దేశీయ ఉత్పత్తిని పెంచి, దిగుమతుల మూలాలను వైవిధ్యపరచేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా అనేక రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది కేంద్రం.
కొత్త మైనింగ్ లైసెన్సులు జారీ చేయడం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలకు ఉత్సాహం కల్పించే దిశగా అడుగులు వేసింది. అదేవిధంగా రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి. దీనివల్ల భారత్ లో విలువైన భూలోహ పరిశ్రమకు పెట్టుబడులు రావడానికి అవకాశాలు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలోని రేర్ ఎర్త్(Rare Earth) సరఫరాలో సుమారు 60 నుంచి 70శాతం వాటా చైనాకే ఉంది. ఈ ఆధారాన్ని తగ్గించుకోవాలంటే భారతదేశం ద్వైపాక్షిక, బహుపాక్షిక భాగస్వామ్యాల ద్వారా ప్రయత్నామ్యా మార్గాలు అన్వేషిస్తోంది. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలతో కలిసి ఏర్పాటు చేసి, మైనింగ్, ప్రాసెసింగ్ రంగాల్లో సాంకేతిక సహకారం పెంచుతోంది. ఇక స్వల్పకాలిక దిగుమతి అంతరాయాలను ఎదుర్కోవడానికి అత్యవసర నిధులు కేటాయించింది. తద్వారా సరఫరా గొలుసు నిరంతరాయంగా కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: