PAN Aadhaar Link : పాన్ కార్డు కలిగిన వారు తప్పనిసరిగా గమనించాల్సిన విషయమిది. పాన్ కార్డ్ను ఆధార్తో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తయింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయం ప్రకారం, ఇంకా లింక్ చేయని పాన్ కార్డులు నిరుపయోగంగా మారే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ కార్డు లింక్ చేయని వారు త్వరలో ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139AA ప్రకారం ప్రతి వ్యక్తి పాన్ను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి. ఈ నిబంధన అమలులో ప్రధాన లక్ష్యాలు పన్ను ఎగవేతలను అరికట్టడం, నకిలీ పాన్ కార్డులను తొలగించడం, మరియు ఆర్థిక వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించడం. గడువు పలు సార్లు పొడిగించినప్పటికీ, ఇంకా లక్షలాది మంది లింకింగ్ పూర్తి చేయలేదు.
Read Also: Sulakshana Pandit: బాలీవుడ్ నటి సులక్షణ ఇకలేరు
ఇప్పుడు గడువు పూర్తైనందున, లింక్ చేయాలంటే రూ.1,000 జరిమానా చెల్లించి మాత్రమే పాన్ కార్డును (PAN Aadhaar Link) మళ్లీ చెల్లుబాటు చేయించుకోవాలి. ఒకవేళ లింక్ చేయకపోతే, చట్టపరంగా పాన్ కార్డు లేదు అన్నట్టే పరిగణించబడుతుంది.

దీని వల్ల కలిగే సమస్యలు(PAN Aadhaar Link) :
- ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయలేరు
- రావలసిన పన్ను రిఫండ్లు నిలిచిపోతాయి
- జీతం, ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్ అధికంగా కట్ అవుతుంది
- రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో బ్యాంకింగ్ లావాదేవీలు చేయడం కష్టమవుతుంది
- కొత్త డీమ్యాట్ ఖాతా ప్రారంభించలేరు
- ఆస్తి కొనుగోలు/అమ్మకాలలో సమస్యలు వస్తాయి
- వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లో ఆలస్యాలు ఎదురవుతాయి
అయితే, ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఇంకా ఉంది. (PAN Aadhaar Link) రూ.1,000 ఫీజు చెల్లించి పాన్ కార్డును తిరిగి యాక్టివ్ చేయించుకోవచ్చు. అందువల్ల, పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్ను వెంటనే తనిఖీ చేసుకుని, లింక్ కాలేదని తెలిసిన వెంటనే ప్రక్రియ పూర్తి చేయడం మంచిది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read also :