బిగ్బాస్(Bigg boss) తాజా ఎపిసోడ్లో హౌస్లోకి మళ్లీ భరణి రావడంతో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం హౌస్లో రీతూ చౌదరి, భరణి, దివ్య నిఖిత, రాము రాథోడ్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, పవన్ కల్యాణ్ పడాల, పవన్ డిమోన్, నిఖిల్ నాయర్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా — ఇలా మొత్తం 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
Read Also: 9వ వారం నామినేషన్స్లో ఘర్షణలు – హౌస్లో మళ్లీ రచ్చ

తాజాగా జరిగిన తొమ్మిదో వారం నామినేషన్స్ ప్రక్రియలో అనూహ్యమైన ట్విస్ట్లు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తన తండ్రిలా భావించే భరణిని తనూజ నామినేట్ చేయడం హౌస్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వారం పవన్ కల్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, సాయి శ్రీనివాస్, భరణి, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఇలా ఏడుగురు నామినేట్ అయ్యారు.
ఇక ఓటింగ్ ప్రక్రియ మొదలవగా, ఆన్లైన్ ఓటింగ్లో(Bigg boss) తనూజ ముందంజలో ఉంది. రెండవ స్థానంలో పవన్ కల్యాణ్ పడాల, మూడవ స్థానంలో సంజనా గల్రానీ ఉన్నారు. సాయి శ్రీనివాస్, భరణి నాలుగో, ఐదో స్థానాల్లో కొనసాగుతుండగా, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ప్రస్తుతం చివరి స్థానాల్లో ఉన్నారు. ఈ సరళి కొనసాగితే రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఓటింగ్ గడువు ఇంకా మిగిలి ఉండటంతో ఫలితాల్లో మార్పులు వచ్చే అవకాశముంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: