हिन्दी | Epaper
చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ కార్పొరేషన్ పదవులు

Hyderabad Drugs Case: ఓవర్‌డోస్‌తో యువకుడి మృతి .. రాజేంద్రనగర్‌లో విషాద ఘటన

Tejaswini Y
Hyderabad Drugs Case: ఓవర్‌డోస్‌తో యువకుడి మృతి .. రాజేంద్రనగర్‌లో విషాద ఘటన

హైదరాబాద్‌లో(Hyderabad Drugs Case) మరోసారి డ్రగ్స్ కేసు కలకలం రేపింది. మత్తు పదార్థాలను అధిక మోతాదులో తీసుకోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మృతుడితో పాటు ఉన్న మరో ఇద్దరు స్నేహితులు కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రకారం, జహనూమకు చెందిన మొహమ్మద్‌ అహ్మద్‌ (26) మొబైల్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆయన రాజేంద్రనగర్‌లోని కెన్వర్త్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ 805లో నివసిస్తూ, అత్తాపూర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ బిన్‌ సలామ్‌ (23), నగరానికి చెందిన షేక్‌ జారా, కోల్‌కతాకు చెందిన మొమతా బిస్వాస్‌తో కలిసి కో–లివింగ్‌లో ఉన్నాడు.

Read Also: Ajith : అజిత్ సినిమాలో విజయ్ సేతుపతి, లారెన్స్!

డ్రగ్స్‌ కొనుగోలు & ఓవర్‌డోస్‌

బుధవారం ఉదయం అహ్మద్‌ లక్డీకాపూల్‌ ప్రాంతానికి వెళ్లి ఒక చిన్న ప్యాకెట్‌లో డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాత్రి ఆ డ్రగ్స్‌ను తీసుకున్న తర్వాత నిద్రపోయాడు. అయితే రాత్రి 1.30 సమయంలో అతడు స్పందించకపోవడంతో స్నేహితులు గమనించగా, అప్పటికే ఆయన మరణించి ఉన్నాడు. పోలీసులు ప్రాథమికంగా ఇది డ్రగ్స్‌ ఓవర్‌డోస్‌ కారణమని భావిస్తున్నారు.

Hyderabad Drugs Case

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అహ్మద్‌ స్నేహితులు సయ్యద్‌ బిన్‌ సలామ్‌, ఒక యువతిపై వైద్య పరీక్షలు జరపగా వారు కూడా మత్తు పదార్థాలు తీసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు కలిసి ఎందుకు ఉంటున్నారు? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870