టాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన జంట విజయ్ దేవరకొండ – రష్మిక మంధాన వివాహంపై కొత్త సమాచారం వెలువడింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం, వీరి పెళ్లి వేడుక వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 26న (26-2-26) జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక తేదీని రెండు కుటుంబాలు శుభముహూర్తంగా నిర్ణయించుకున్నాయని సమాచారం. రాజస్థాన్లోని అద్భుతమైన ఉదయ్పూర్ కోటలో ఈ వివాహ వేడుక జరగనుందని, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ వేడుకను పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్గా నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం.
Latest News: Prabhas: ‘స్పిరిట్’ లో దగ్గుబాటి హీరో
గత నెల అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం (ఎంగేజ్మెంట్) జరిగినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఇరు కుటుంబాలు ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. కానీ ఇటీవల మీడియా మరియు అభిమానులు గమనించిన కొన్ని అంశాలు ఈ వార్తలకు బలాన్ని ఇచ్చాయి. పలు ఈవెంట్లలో, ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇద్దరూ తమ చేతి వేళ్లలో రింగ్స్ ధరించి కనిపించడం, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాకుండా రష్మిక హాజరైన ‘గర్ల్ఫ్రెండ్’ మూవీ ఈవెంట్లో, అలాగే ఒక టాక్ షోలో కూడా ఆమె పరోక్షంగా నిశ్చితార్థంపై హింట్ ఇచ్చినట్లు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

విజయ్–రష్మికల ప్రేమ కథ టాలీవుడ్లో చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. “గీతగోవిందం” మరియు “డియర్ కామ్రేడ్” చిత్రాల ద్వారా వీరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం క్రమంగా బలమైన బంధంగా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు పెళ్లి తేదీ బయటకు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ కోటలో జరిగే ఈ గ్రాండ్ వెడ్డింగ్ టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భారీ చర్చకు దారితీయనుంది. అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో అన్నదే ఇప్పుడు అభిమానుల ఆసక్తి కేంద్రమైంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/