సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు దండుకుంటూ తమ రూట్ను మార్చారు. ముఖ్యంగా ఆడవారు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని(Hyderabad) వెంగళరావునగర్కు చెందిన ఒక వృద్ధురాలికి అపరిచితుడు వాట్సాప్ కాల్ చేసి, ఆమె కుమారుడు లండన్ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురయ్యాడని, ఐసీయూలో చేర్చానని నమ్మబలికాడు. కొడుకు చికిత్స కోసం డబ్బులు కావాలని కోరడంతో, ఆమె అది నిజమా అని ఆలోచించకుండా వెంటనే ₹35.23 లక్షలు పంపారు.
Read Also: Kamareddy: నేనే కలెక్టర్ ని.. ఇక్కడే నా పోస్టింగ్ చివరకి ఏమైంది?

మోసం వెలుగులోకి, కారణాలు
వృద్ధురాలు ఈ విషయాన్ని తన పెద్ద కుమారుడికి చెప్పడంతో అతనికి అనుమానం వచ్చింది. వెంటనే మోసగాడిని సంప్రదించి, తన సోదరుడి ఫొటోలు పంపాలని కోరగా, ఆ మోసగాడు నిరాకరించి, ఛాటింగ్లో తన వివరాలు తొలగించాడు. ఈ నేరాలన్నీ మన సోషల్ మీడియా సమాచారం ఆధారంగానే జరుగుతున్నాయి. ‘మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు’, ‘జర్మనీలో టూర్కు వెళ్లాడు’ వంటి పోస్టులు పెట్టడం మోసాలకు కారణమవుతుంది. సైబర్ నేరగాళ్లు విమాన టిక్కెట్లు, పాస్పోర్టు, ఆధార్ కార్డుల సమాచారాన్ని సేకరించి కూడా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే యువత డేటాను ఏజెంట్ల నుంచి కొనుగోలు చేసి కూడా ఈ మోసాలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. నెల రోజుల్లో నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 20 నుంచి 25కు పైగా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
పోలీసుల సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇలాంటి కేసుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్క్రైమ్(Cyber Crime) ఎస్సై హిమారెడ్డి(SI Himareddy) సూచిస్తున్నారు. విదేశాల్లోని బంధువులు ఆపదలో ఉన్నారంటూ బెదిరించడాన్ని ‘ఫేక్ యాక్సిడెంట్స్, ఫ్యామిలీ డిస్ట్రెస్ స్కామ్స్’ అంటారని ఆమె తెలిపారు. ఎవరైనా ఈ తరహా ఫోన్కాల్స్ చేస్తే ఆందోళనకు గురై వెంటనే డబ్బులు పంపొద్దని సూచించారు. సదరు వ్యక్తులకు పోన్ చేసి అది నిజమా? లేదా? అని ధ్రువీకరించుకోవాలి. అవసరం అయితే వారి స్నేహితులు లేదా అధికారిక ఎంబసీ అధికారులతో ధ్రువీకరించుకున్న తర్వాతే ఆర్థిక నిర్ణయం తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: